ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

 

*🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*


*🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌*

*🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉన్న ఆచార్య ఆర్‌.లింబాద్రి పూర్తిస్థాయి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వైస్‌ఛైర్మన్‌గా ఓయూ వృక్షశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యుడు షేక్‌ మహమూద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆమోదం మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం జీఓ జారీ చేశారు. మూడేళ్లపాటు ఆ పదవుల్లో కొనసాగనున్నారు. 2017 ఆగస్టు 3న ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు-1గా నియమితులైన లింబాద్రి, 2021 ఆగస్టు 24న తుమ్మల పాపిరెడ్డి స్థానంలో ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ అయ్యారు. ఆయన ఓయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో సీనియర్‌ ఆచార్యుడు. వచ్చే నెలలో పదవీ విరమణ పొందనున్నారు.*

*💥నిరుపేద కుటుంబం నుంచి...*

*🌀నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో అత్యంత పేద దళిత కుటుంబంలో జన్మించిన లింబాద్రి అష్టకష్టాలు పడి చదువుకున్నారు. తన గ్రామం నుంచి డిగ్రీ పూర్తి చేసిన తొలి వ్యక్తి అయ్యారు. పట్టుదలతో పీహెచ్‌డీ వరకు చదివి ఓయూలో సహాయ ఆచార్యుడిగా ఎంపికయ్యారు. గతంలో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, ఓయూ ఉపకులపతి ఓఎస్‌డీగా వ్యవహరించారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉన్నకాలంలో బీటెక్‌కు దీటుగా డిగ్రీలో బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌, బీఎస్సీ డేటా సైన్స్‌, బీఎస్సీ హానర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌, స్కిల్‌ ఓరియంటెడ్‌ కోర్సులను ప్రవేశపెట్టడంలో చొరవ తీసుకున్నారు. ఇంజినీరింగ్‌తో పోటీగా కొలువులు దక్కాలని భావించి డిగ్రీ పరీక్షలు, మూల్యాంకనంలో మార్పులకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో ఒప్పందం కుదుర్చుకొని అధ్యయనం చేయించారు. ఉపాధ్యక్షుడిగా నియమితులైన మహమూద్‌ రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఉన్నత విద్యామండలిలో ఇప్పటికే మరో ఉపాధ్యక్షుడిగా ఆచార్య వి.వెంకటరమణ ఉన్నారు.*

ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను ప్రారంభించారు.


 జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను ప్రారంభించారు.






,ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం  ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని...  ఇప్పటికే జిల్లా ప్రభుత్వ వైజ కళాశాలలో అనేక అధునాతన వసతులు కల్పించారని...

ప్రస్తుతం... గతంలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో మాత్రమే ఉన్న..

 30 లక్షల రూపాయలు విలువ చేసే  ఫ్యాకో క్యాటరాక్ట్  మిషన్ ను...నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో... ఏర్పాటు చేసి ఈనాడు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని... పేద బడుగు వర్గాలకు.. కంటికి సంబంధించిన వ్యాధులకు సత్వరం చికిత్స చేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని..ఇందుకు నల్లగొండ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి... వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

అనంతరం... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తనిరి హరీష్ రావు.. ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని, నల్గొండ వైద్య కళాశాలలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు...

 హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ లచ్చు నాయక్..కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి... మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్... కౌన్సిలర్లు సమీయొద్దీన్..పబ్బు సందీప్  బోయనపల్లి శ్రీనివాస్ జేరిపోతుల భాస్కర్ గౌడ్ ఆలకుంట్ల మోహన్ బాబు... తదితరులు వెంట ఉన్నారు

మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠచదించడం జరిగింది

 మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది


కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ఉత్తిర్నుడు ఐనాడు ..కాలేజీ బ్యాలేన్స్ ఫీస్ మొత్తం 50000 మా అత్మీయ శ్రేయోభిలషులు శ్రీ ఎఱ్ఱం విజయ్ కుమార్ గారు శ్రీ బుర్గు రవి గారు శ్రీ విక్రమ్ గారు రామిని విజయ్ గారు చీదర రమేశ్ గారు 

A.Sathyanarayana గారు తోట రంగయ్య గారు తుమ్మల బాల్ రెడ్డి గార్లు ఆర్థికంగా సహకరించారు వారికి ధన్యవాదాలు🙏🙏🙏 తెలుపుకుంటున్నాను అన్ని దనాల్లో కన్న విద్యా సహకారము మిన్న ... ఉపేందర్ మొగుళ్ళు పల్లీ విద్యా దాతలకు సరస్వతీ దేవి కరుణ కటాక్షాలు కల్గి ఉంటుంది అని తెలుపుకుంటునాను...

ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి


 ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి                                          రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశం చాలా బాగా జరిగిందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చేందుకు కావాల్సిన అన్ని మార్గాలపై విపులంగా చర్చలు సాగాయన్నారు. తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైందన్నారు. బిఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనుందన్నారు.

ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి  

జనరల్ స్థానంలో బీసీలకు సీట్లు ఇవ్వాలని తాను రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు. వచ్చే నెలలో క్లారిటీ ఉన్న సీట్లలో టికెట్ల ప్రకటన ఉంటుందన్నారు. సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు కేటాయిస్తుందన్నారు. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తానని రాహుల్ చెప్పారన్నారు.

బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

 బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు



Telangana Congress : మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లితో సహా కాంగ్రెస్ నేతలు దిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. జులై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అయ్యారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌కు చెందిన దాదాపు 35 మంది నేతలు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీని వీడిన పలువురు నేతలు తిరిగి సొంతగూటికి చేరుతుండటం సంతోషంగా ఉందని రాహుల్‌ గాంధీ అన్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఘర్‌ వాపసీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుందని అందుకు పార్టీ నేతలు సమష్ఠిగా కృషి చేయాలని రాహుల్‌ గాంధీ అన్నట్లు నేతలు పేర్కొన్నారు. "కేసీఆర్‌ హఠావో తెలంగాణ బచావో" అనే నినాదంలో పార్టీ నేతలు ముందుకెళ్లాలని రాహుల్‌ గాంధీ సూచించారన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీతోపాటు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో జులై 2 ఖమ్మంలో జరిగే సభలో పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని వీరిద్దరూ వారిద్దరు కలిశారు. జులై 2న ఖమ్మంలో నిర్వహించనున్న సభకు రావాలని రాహుల్ గాంధీని టీపీసీసీ నేతలు ఆహ్వానించారు. ఆ సభలో పొంగులేటి, జూపల్లి సహా మరింత మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ అరికెలా నర్సారెడ్డి, ఇతర నేతలు గుర్నాథ్ రెడ్డి, ముద్దప్పా దేశ్ ముఖ్, కిష్టప్ప హస్తం పార్టీలో చేరనున్నారు.


జులై 2న ఖమ్మంలో కనీవినీ ఎరుగని సభ

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ అనుకున్న అభివృద్ధి జరగలేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్న ఆయన... జులై 2న పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ బిడ్డలు ఏం కోరుకున్నారో అవి జరగలేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి వల్ల ప్రజలకు దక్కాల్సినవి దక్కడం లేదన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. జులై 2 ఖమ్మంలో కనీవినీ ఎరుగని సభ నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ కు అధికారం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దెబ్బతీశారని విమర్శించారు. తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారనో, పదవుల కోసమే తాను పార్టీ మారడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదన్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. తనకు పదవులు ముఖ్యం కాదన్న ఆయన... పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని తెలిపారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని భావించినా...కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

జూలై నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్.. ఈ తేదీల్లో హాలీ డే


జూలై నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్.. ఈ తేదీల్లో హాలీ డే

Bank Holidays in July 2023: వచ్చే నెలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు 15 రోజులు బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రాంతీయ సెలవులకు జాబితాను విడుదల చేసింది ఆర్‌బీఐ. మొహర్రం సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుగా ప్రకటించింది.  

July Bank Holidays List: జూలై నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్.. ఈ తేదీల్లో హాలీ డే

Bank Holiday in July 2023: జూలై నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో కలిపి జూలై నెలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోని బ్యాంకులు మొహర్రం పర్వదినం సందర్భంగా సెలవు ఉండనుంది. గురు హరగోవింద్ సింగ్ జన్మదినోత్సవం, అషురా, కేర్ పూజ వంటి పండుగలకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీ డే వచ్చింది.  8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగల కోసం ఆర్‌బీఐ సెలవు ప్రకటించింది.

            వచ్చే నెలలో బ్యాంకులకు సంబంధించి ముఖ్యమైన పనులు ఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. ఏటీఎం, క్యాష్ డిపాజిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి పనులను ఇంటి వద్ద నుంచి కూడా చేసుకోచ్చు. అయితే రూ.2 వేల నోటును బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలని అనుకునేవారు సెలవుల జాబితాను చెక్ చేసుకుని వెళ్లడం బెటర్. రూ.2000 నోటును మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉన్న విషయం తెలిసిందే.

జూలై 2023లో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

==> జూలై 2:  ఆదివారం

==> జూలై 5: గురు హరగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలీ డే

==> జూలై 6: ఎంహెచ్‌ఐపీ డే సందర్భంగా మిజోరాం రాష్ట్రంలో సెలవు

==> జూలై 8: రెండో శనివారం కారణంగా హాలీ డే

==> జూలై 9: ఆదివారం

==> జూలై 11: కేర్ పూజ సందర్భంగా త్రిపుర రాష్ట్రంలో బ్యాంకులు బంద్

==> జూలై 13: భాను జయంతికి సిక్కింలో బ్యాంకులు క్లోజ్ 

==> జూలై 16: ఆదివారం

==> జూలై 17: యు టిరోట్ సింగ్ డే- మేఘాలయలో బ్యాంకులకు సెలవు 

==> జూలై 22: నాలుగో శనివారం

==> జూలై 23: ఆదివారం

==> జూలై 28: అషూరా -జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు హాలీ డే

==> జూలై 29: మొహర్రం (దాదాపు అన్ని రాష్ట్రాల్లో)

==> జూలై 30: ఆదివారం

==> జూలై 31: అమరవీరుల దినోత్సవం సందర్భంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సెలవు. 

To days gold rates

 Good afternoon.


Gold   live 604500

Silver live  71300.








Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...